News February 1, 2025
కోనరావుపేట: ఈత చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడికి గాయాలు

కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన ఏగోలపు మల్లేశం గౌడ్ శుక్రవారం ఈత చెట్టు నుంచి పడి గాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన మల్లేశం గౌడ్ ఈత చెట్టు ఎక్కుతుండగా మోకుజారి కింద పడిపోయాడు. దీంతో గాయాలైన గీత కార్మికున్ని తోటి కార్మికులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మల్లేశం గౌడ్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదుకోవాలని కుటుంబ సభ్యులు గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News January 12, 2026
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

తాను ఉండగా మరో మహిళతో కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన సాయిచరణ్కు 15ఏళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్లుగా భార్యను వదిలేసిన అతను కీసర అహ్మద్ గూడలో ఉంటున్నట్లు తెలుసుకున్న శిల్ప అక్కడికి చేరుకుంది. ఇంట్లోకి రానివ్వకపోవడంతో బయటే కూర్చుంది. పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
News January 12, 2026
లాభాల్లోకి స్టాక్ మార్కెట్స్

నష్టాలతో మొదలైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు కోల్పోయింది. అలాంటి పరిస్థితి నుంచి సెన్సెక్స్ 60కి పైగా పాయింట్లు లాభపడి 83,640 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 40కి పైగా పాయింట్లు ఎగబాకి 25,725 వద్ద కొనసాగుతోంది.
News January 12, 2026
ADB: మున్సిపల్ పోరుకు ‘గులాబీ’ వ్యూహం

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్ జండా ఎగిరేసి వైభవం సాధించేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మక పావులు కదుపుతోంది. మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా సమాయత్తమవుతోంది. సర్కార్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ఎన్నికల్లో విజయం సాధించేలా అభ్యర్థులను రంగంలోకి దించాలని అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో చూపిన సత్తాను మున్సిపల్ పోరులోనూ పునరావృతం చేయాలని నిర్ణయించింది.


