News February 1, 2025

ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ: హోం మంత్రి అనిత

image

రాష్ట్రంలో అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు కూటమి ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 2019 అక్టోబర్ 15వ తేదీ కంటే ముందున్న వాటికి వర్తింప చేయనున్నట్లు తెలిపారు. గతంలో జారీచేసిన ఉత్తర్వులను పక్కన పెడుతూ కొత్తగా జీఓ నంబర్ 30 జారీ చేసినట్లు వివరించారు. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ జరుగుతుందన్నారు.

Similar News

News September 16, 2025

ఆ ఆరోపణలు నిరూపించాలి: గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్

image

TG: గ్రూప్-1 ఉద్యోగాలను రూ.3Cr చొప్పున కొన్నారన్న <<17701513>>ఆరోపణలను<<>> ర్యాంకర్ల తల్లిదండ్రులు కొట్టిపారేశారు. ‘గ్రూప్-1పై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. మాలో కొందరికి సరిగ్గా తిండి లేని పరిస్థితులు ఉన్నాయి. కష్టపడి, పస్తులుండి పిల్లలను చదివించాం. పిల్లలు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారు. మాకు న్యాయం చేయాలి లేదా ఆరోపణలు నిరూపించాలి’ అంటూ మీడియా ముందు పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

News September 16, 2025

దసరా అంటే విజయవాడకు వెళ్లాలనిపించేలా ఉత్సవాలు: సత్యకుమార్

image

AP: దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా ‘విజయవాడ ఉత్సవ్’ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులతో VJAలో నిర్వహించిన ఉత్సవాల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ‘22వ తేదీ నుంచి 11రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తాం. అంతరించిపోతున్న కళలను పరిరక్షించేలా వేడుకలుంటాయి. VJAను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఇవి దోహదపడతాయి. మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తాం’ అని తెలిపారు.

News September 16, 2025

రోడ్లపై పశువుల నివారణకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్

image

పెద్దపల్లి రోడ్లపై పశువుల సంచారాన్ని నియంత్రించాలని, వాటికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. సోమవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కుక్కలు, కోతులు, పందులు, ఆవులు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు నివారించేందుకు వాటిని సంబంధిత కేంద్రాలకు తరలించాలన్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్(ఎబీసీ) చర్యలు తప్పనిసరని పేర్కొన్నారు.