News February 1, 2025
అల్లూరి జిల్లాలో పాఠశాల భవనం ఆక్రమణ..!

పెదబయలు మండలంలోని బొంగారం ఎంపీపీ పాఠశాల భవనంలో మూడు వారాలుగా బీహార్ వాసులు ఆక్రమించుకున్నారని గ్రామస్థులు శుక్రవారం తెలిపారు. గమనించిన సర్పంచ్ లక్ష్మీపతి, ఎంపీటీసీ కొండబాబు పాఠశాల భవనం ఖాలీ చేయాలని ఎన్నోసార్లు చెప్పినా వారు గొడవలకు ఎగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 40మంది విద్యార్థులకు వేరే భవనంలో బోధనలు సాగుతుందని ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించాలని తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదం.. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

TG: మీర్జాగూడ <<18183773>>ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా ఆమె భర్తకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు పిల్లలు అదృష్టవశాత్తు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఓవైపు తల్లి మరణం, మరోవైపు ఆసుపత్రిలో తండ్రి ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండిపోయారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
News November 3, 2025
ASF: అనధికారంగా వైన్స్ వేలం..!

ఆసిఫాబాద్ జిల్లాలో 5 రోజుల క్రితం మద్యం దుకాణాల టెండర్లు పూర్తయ్యాయి. దుకాణాలు పొందిన వారికి అదృష్టం వరించిందని అందరు అనుకున్నారు. అయితే నిజమే వారికి అదృష్టం వరించింది. అధికారిక టెండర్లు పూర్తవ్వగానే ఇప్పడు అనధికారంగా వేలం పాటలు నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్లలో దుకాణాలు దక్కించుకున్న వారు ఆ దుకాణాలను రూ.కోట్లలో విక్రయించడానికి చూస్తున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
News November 3, 2025
ములుగు: అర్ధరాత్రి భుజాలపై పిల్లలతో వాగు దాటారు!

ములుగు(D) ఏటూరునాగారం(M) కొండాయిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాధరి శేఖర్ దంపతుల ఆరేళ్ల పాపకు తీవ్ర జ్వరం వచ్చింది. తల్లడిల్లిన తల్లిదండ్రులు దొడ్ల-మల్యాల మధ్య జంపన్నవాగులో అర్ధరాత్రి ఒంటిగంటకు తమ ఇద్దరు పిల్లలను భుజాలపై ఎత్తుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగుదాటారు. ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడంతో అర్ధరాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం.


