News February 1, 2025

ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారా?

image

ఉద్యోగులకు ఏసీ ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం అలవాటైపోయింది. కానీ ఇది తీవ్రమైన వ్యాధులకు దారి తీయొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలపాటు ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు పెరగడం, మధుమేహం వస్తుంది. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మెడ, వెన్ను నొప్పి వస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, డిప్రెషన్, అల్జీమర్స్, రక్తపోటు, పక్షవాతం వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

Similar News

News February 1, 2025

నిలిచిపోయిన పెన్షన్ల పంపిణీ?

image

AP: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. సర్వర్‌లో సమస్య రావడంతో పింఛన్ల పంపిణీ ప్రారంభమైన కాసేపటికే నిలిచిపోయినట్లు సమాచారం. సమస్యను పరిష్కరించి పింఛన్ల పంపిణీని కొనసాగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

News February 1, 2025

అసలు బడ్జెట్‌కు, GSTకి లింకేంటి?

image

Tax అనగానే SMలో Income Tax, GSTకి ముడిపెట్టి ఏదేదో మాట్లాడుతుంటారు. రూ.50లక్షల కారు కొంటే 28% GST, 20% GST Cess, మళ్లీ 30% IT అంటూ పోస్టులు పెడతారు. అన్నీ బడ్జెట్లోనే నిర్ణయించేస్తారని భావిస్తుంటారు. బడ్జెట్లో IT శ్లాబులు, పాలసీల గురించే ఉంటుంది. GSTతో లింకు ఉండదు. ఈ పన్ను రేట్లను ఆ కౌన్సిల్ ఏటా 3 సార్లు సమావేశమై నిర్ణయిస్తుంది. అంతా ఏకగ్రీవమే. ఒక్క రాష్ట్రం వ్యతిరేకించినా నిర్ణయం తీసుకోరు.

News February 1, 2025

స్వల్పంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

image

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 తగ్గించాయి. ఈ నిర్ణయంతో ఢిల్లీలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1797కి చేరింది. ఈ రేటు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పూ లేదు.