News February 1, 2025
ఐర్లాండ్లో రొంపిచర్ల వాసి మృతి
రొంపిచర్ల గ్రామానికి చెందిన చెరుకూరి సురేష్ (26) ఐర్లాండ్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు శుక్రవారం తెలిపారు. సురేష్ ఐర్లాండ్లో ఎమ్మెస్ చదవడానికి సంవత్సరం క్రితం వెళ్ళాడు. స్నేహితులతో కలిసి కారులో ముగ్గురితో వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సురేష్తో పాటు విజయవాడ సమీపంలోని జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన మరొకరు మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News February 1, 2025
MBNR: తమ్ముడిని దించొద్దామని వెళ్లి.. చనిపోయాడు
MBNR జిల్లా మన్యంకొండ సమీపంలో నిన్న జరిగిన <<15324831>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మండలంలోని పోతన్పల్లికి చెందిన ఆంజనేయులు(21) తమ్ముడు కేశవులు(19) గుంటూర్లో చదువుకుంటున్నాడు. సెలవులపై వచ్చిన కేశవులును గుంటూర్కు పంపేందుకు శుక్రవారం తెల్లవారుజామున బైక్పై ఇద్దరూ బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంజనేయులు మృతి చెందాడు. కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
News February 1, 2025
దారుణం.. తల్లి మృతదేహంతో తొమ్మిది రోజులు!
TG: తల్లి మృతదేహం పక్కనే డిప్రెషన్తో ఇద్దరు కూతుళ్లు 9రోజులు గడిపారు. HYDలోని బౌద్ధనగర్కు చెందిన రాజు, లలిత(45)కు రవళిక, అశ్విత ఇద్దరు కుమార్తెలు. 4ఏళ్ల క్రితం వీరిని వదిలేసి రాజు ఎక్కడికో వెళ్లాడు. ఈ క్రమంలో లలిత గుండెపోటుతో మరణించారు. అంతిమ సంస్కారాలకు డబ్బులు లేక కూతుళ్లు కూడా చనిపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో నిన్న బాహ్య ప్రపంచానికి తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
News February 1, 2025
నందికొట్కూరులో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మృతి
నందికొట్కూరుకు చెందిన రిటైర్డ్ టీచర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఇందిరాబాయి (90) శనివారం ఉదయం మరణించారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1993లో ఆమె ఉత్తమ ఉపాధ్యాయులిగా రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు.