News February 1, 2025

వర్ధన్నపేట: ఏడో తరగతి బాలిక సూసైడ్

image

ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.

Similar News

News January 14, 2026

నేడు రెండో వన్డే.. సిరీస్‌పై టీమ్ ఇండియా గురి

image

నేడు భారత్-న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. 3 ODIల సిరీస్‌లో ఇప్పటికే ఒకటి టీమ్ ఇండియా గెలవగా రెండోది కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లో అదరగొట్టారు. ఇక కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అదే విధంగా బౌలర్లు కూడా రాణిస్తే సిరీస్ మనదే అవుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి JioHotstar, Star Sportsలో వస్తుంది.

News January 14, 2026

ఎమ్మెల్యే పీఎస్ఆర్‌కు డిప్యూటీ సీఎం లేఖ

image

రాష్ట్రంలో విద్యుత్ పరంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కోరారు. ఈ మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు పంపిన లేఖను స్థానిక విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం అందజేశారు. విద్యుత్ శాఖ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, త్వరలో జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

News January 14, 2026

మహిళలకు రూ.1500 ఎప్పుడు ఇస్తారు: YS షర్మిల

image

AP: ప్రభుత్వంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మహాశక్తి పథకాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు. పండుగల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధి పథకం ప్రకారం 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.