News February 1, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించండి:ఎంపీ
నేడు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు MP రఘురాంరెడ్డి తెలిపారు. KTDMఎయిర్పోర్ట్, భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్, KMM-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, KMM- VJD హైవేకు నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. KTDM కలెక్టరేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కిన్నెరసానిపై వంతెన నిర్మాణానికి సైతం నిధులు కేటాయించాలని కోరారు.
Similar News
News February 1, 2025
వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్ ప్లాంట్లు
వ్యవసాయయోగ్యం కాని భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలని ఖమ్మం SE సురేందర్ కోరారు. 500 కిలోవాట్ల నుంచి 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను TGERC నిర్ణయించిన టారిఫ్ ఆధారంగా విద్యుత్ డిస్కంలు కొనుగోలు చేస్తాయన్నారు. www.tgredco.telangana.gov.inవెబ్సైట్లో 22లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 1, 2025
జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై కలెక్టర్ ఫోకస్..!
ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. NKP బౌద్ధస్తూపం, పాలేరు రిజర్వాయర్, ఖిల్లా, పులిగుండాల ప్రాజెక్ట్, వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎకోటూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఎకో టూరిజంకు బ్రాండింగ్ వచ్చేలా ప్రత్యేక లోగో, ట్యాగ్ లైన్ తయారు చేయించాలన్నారు.
News February 1, 2025
ఖమ్మం: వన మహోత్సవం @ లక్ష మొక్కలు
వన మహోత్సవం 2025-26లో భాగంగా కేఎంసీలో మొక్కలను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. శుక్రవారం ఖమ్మం నగరంలోని గొల్లగూడెంలో ఏర్పాటు చేసిన నర్సరీని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రారంభించారు. లక్ష మొక్కలు పెంచేందుకు పనులను ముమ్మరం చేశారు. మొక్కల పెంపకం కోసం కవర్లల్లో మట్టి నింపడం..విత్తనాలు విత్తడం.. మొక్కల సంరక్షణ పక్కాగా కొనసాగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.