News February 1, 2025
పర్చూరు టీడీపీ నగర అధ్యక్షుడు మృతి

పర్చూరు TDP నగర అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణ గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన పర్చూరు MLA ఏలూరి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడు. TDPలో క్రియాశీలక వ్యక్తి అని పలువురు తెలిపారు. పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని MLA ఏలూరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా వెంకటకృష్ణ సతీమణి శ్రీలక్ష్మీ నెలరోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నెల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News September 17, 2025
అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదు: మోదీ

పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి ఇదే రోజు విముక్తి లభించిందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయి పటేల్ ధైర్యసాహసాలు ప్రదర్శించి భారత్లో విలీనం చేశారని చెప్పారు.
News September 17, 2025
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాబోయే 3గంటల్లో నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, HYD, జగిత్యాల, జనగాం, BHPL, కామారెడ్డి, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, PDPL, సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.
News September 17, 2025
సంగారెడ్డి: పాఠశాలల్లో పేరెంట్-టీచర్ మీటింగ్

ఈ నెల 20న సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల అభివృద్ధి, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ఆయన సూచించారు. పీటీఎంకు సంబంధించిన వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.