News February 1, 2025
HYD: సీఎం రేవంత్ మిస్ గైడెడ్ మిసైల్లా పనిచేస్తున్నారు: కవిత

నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తున్నదని.. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయడం మానేసి నిజాలు చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమాజీగూడలోని ప్రెస్క్లబ్లో నీళ్లు-నిజాలు అంశంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కవితతోపాటు మేధావులు, విశ్రాంత ఇంజినీర్లు పాల్గొన్నారు. సీఎం రేవంత్ మిస్ గైడెడ్ మిసైల్లా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Similar News
News September 14, 2025
HYD: రోడ్డుపై చెత్త వేస్తే 8 రోజుల జైలు శిక్ష

చెత్తపై స్పెషల్ డ్రైవ్ నేపథ్యంలో HYD పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డ మీద చెత్త వేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు మీద చెత్త వేసే చట్టంలోని సెక్షన్ ప్రకరాం 8 రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. బోరబండ పోలీసులు 2 రోజుల్లో రోడ్లపై చెత్త వేపిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మీద ఛార్జిషీటు దాఖలు చేసి న్యాయమూర్తి ముందు హజరుపరచగా రూ.1000 ఫైన్ వేశారు.
News September 14, 2025
HYDలో రేషన్కార్డులు కట్.. దేనికో తెలియక షాక్

HYDలో చాలా చోట్ల లబ్ధిదారులకు రేషన్కార్డు రద్దయ్యాయని లబోదిబోమంటున్నారు. రేషన్షాపుల దగ్గర కార్డ్ నం. ఎంటర్ చేసేవరకు తెలియడం లేదని, దీనిపై ఎలాంటి సమాచారం లేదని మండిపడుతున్నారు. IT చెల్లించకున్నా తమ తెల్లరేషన్కార్డు రద్దవ్వడంపై గందరగోళానికి గురవుతున్నారు. కాగా, ఆధార్, పాన్ ద్వారా ఆర్థిక స్థితిగతులను ఆదాయపన్నుశాఖ పరిశీలించి అనర్హుల కార్డు ర్దదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
News September 14, 2025
HYD: కొడుకును చంపి మూసీలో పడేశాడు

HYDలోని బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు అనాస్(3)ని తండ్రి మహమ్మద్ అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని ఏంతెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానంతో విచారించగా.. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.