News February 1, 2025
తిరుపతి జిల్లాలో ఆగిన పెన్షన్ల పంపిణీ

తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాలలో సర్వర్ సమస్యల వల్ల పెన్షన్ల పంపిణీ ఆగినట్లు స్థానికులు తెలిపారు. తడ, పుత్తూరు, వడమాలపేట, తొట్టెంబేడు తదితర ప్రాంతాలలో ఈ సమస్య ఉన్నట్లు సమాచారం. వడమాలపేట(M) బుట్టిరెడ్డి కండ్రిగలో మొత్తం 250 పెన్షన్లు ఉండగా సర్వర్ సమస్యతో ఐదు పెన్షన్లనే పంపిణీ చేసినట్లు సిబ్బంది చెప్పారు.
Similar News
News March 14, 2025
MBNR: రెండు బైకులు ఢీ.. యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం సీసీ కుంట మండల పరిధిలో చోటు చేసుకుంది. SI రామ్లాల్ నాయక్ వివరాలు.. పార్దిపూర్ గ్రామానికి చెందిన రాజు (31) నిన్న సాయంత్రం బైక్పై లాల్ కోట వైపు వెళ్తున్నాడు. పర్దిపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న రమేష్ నాయక్ బైక్ ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొనగా రాజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్కు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
News March 14, 2025
PDTR: ఆసుపత్రిలో దొంగతనానికి విఫలయత్నం

ఆసుపత్రిలోనే డాక్టర్ చైన్ కొట్టేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ శ్రీవాణి గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఆపరేషన్ రూము వైపు వెళ్తుండగా.. మెట్ల వద్ద ఓ వ్యక్తి ఆమె మెడలోని చైన్ లాగడానికి ట్రై చేశాడు. అతడిని వెనక్కి నెట్టేయగా.. మరోసారి చైన్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. డాక్టర్ కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.