News February 1, 2025
కాకినాడలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

ఉమ్మడి తూ.గో జిల్లా కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన ఎం.ఆదిమూర్తి(65), ధనలక్ష్మి(60) దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి పిల్లలు విదేశాల్లో ఉంటుండగా ఇక్కడ వారిద్దరే ఉంటున్నారు. అనారోగ్య సమస్యలున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని మనోవేదనకు గురై శుక్రవారం సాయంత్రం ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాలను వెలికితీయించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 6, 2025
శాతవాహన రైలు లింగంపల్లి వరకు పొడిగించాలని డిమాండ్

శాతవాహన రైలు లింగంపల్లి వరకు పొడిగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కాచిగూడ, బేగంపేట, హైటెక్ సిటీ మార్గంలో భారీగా ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో ఈ రైలు లింగంపల్లి వరకు నడిస్తే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు సౌలభ్యం కలుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైలు పొడిగింపు కోసం రైల్వే అధికారులను త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News November 6, 2025
అల్లు అర్జున్ నుంచి భారీ ప్రాజెక్టులు!

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని పాన్ వరల్డ్ రేంజ్లో 2027లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత బన్నీ ఏయే ప్రాజెక్టులు చేయబోతున్నారు అన్న దానిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ లిస్ట్లో సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను(సరైనోడు 2) పేర్లు వినిపిస్తున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ భారీగా ఉంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News November 6, 2025
‘నీమాస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు (1/2)

ప్రకృతి సేద్యంలోనూ చీడపీడల నివారణ ముఖ్యం. ఈ విధానంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగులు, పంటకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాల నివారణకు నీమాస్త్రం వాడతారు.
నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు ☛ KG నాటు ఆవు లేదా దేశీ ఆవు పేడ ☛ 5 లీటర్ల నాటు ఆవు లేదా దేశీ ఆవు మూత్రం ☛ 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు అవసరం.


