News February 1, 2025

గుర్ల: విద్యుత్ వైర్లు పట్టుకుని యువకుడి సూసైడ్

image

గుర్ల మండలంలో ఓ యువకుడు విద్యుత్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన పులేషణ కుమార్ గుర్ల మండలం కోటగండ్రేడు రైస్‌మిల్లులో 2 నెలలుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రైస్‌మిల్ దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లను పట్టుకున్నాడు. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందగా SI నారాయణ కేసునమోదు చేశారు.

Similar News

News November 18, 2025

VZM: వినతులు కుప్పల తెప్పలు.. పరిష్కారం ఏ స్థాయిలో?

image

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరుగుతున్న PGRS కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు పోటెత్తున్నాయి. వాటి పరిష్కారం ఏ స్థాయిలో ఉందనేది ప్రశ్నార్ధకంగా మారింది. వినతుల పరిష్కారం అంతంత మాత్రమేనని స్వయంగా అర్జీదారులే ఆరోపిస్తున్న పరిస్థితి. వినతుల పరిష్కారానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లైట్ తీసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

News November 18, 2025

VZM: వినతులు కుప్పల తెప్పలు.. పరిష్కారం ఏ స్థాయిలో?

image

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరుగుతున్న PGRS కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు పోటెత్తున్నాయి. వాటి పరిష్కారం ఏ స్థాయిలో ఉందనేది ప్రశ్నార్ధకంగా మారింది. వినతుల పరిష్కారం అంతంత మాత్రమేనని స్వయంగా అర్జీదారులే ఆరోపిస్తున్న పరిస్థితి. వినతుల పరిష్కారానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లైట్ తీసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

News November 18, 2025

విజయనగరంలో ఈనెల 20న జాబ్ మేళా

image

విజయనగరం MR కాలేజీలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీద సోమవారం తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, ATC టైర్స్, మెడ్ ప్లస్ సంస్థలలో కలిపి 195 పోస్టులు భర్తీ చేయనున్నారని, అభ్యర్థులు ముందుగా employment.ap.gov.inలో నమోదు చేసుకుని, సర్టిఫికెట్లు, బయోడేటా, 2 ఫొటోలతో జాబ్ మేళాకు హాజరవ్వాలన్నారు. డిగ్రీ, పీజీ, ANM, GNM, ఫార్మసీ, ఐటీఐ, SSC చదివిన వారు అర్హులుగా పేర్కొన్నారు.