News February 1, 2025

గద్వాల: బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేజీ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 9, 2025

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారి 65పై చేర్యాల గేటు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును తుఫాన్‌ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నారాయణఖేడ్‌కు చెందిన బాలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News November 9, 2025

ములుగు: బాలుడి మృతిపై వైద్యశాఖ సీరియస్..!

image

ములుగు(D) కన్నాయిగూడెం(M) గూరేవులకు చెందిన హరినాథ్ స్వామి(7) అనే <<18238426>>బాలుడు పాముకాటుతో<<>> శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా వైద్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక ఆసుపత్రికి తీసుకొచ్చిన బాలుడికి యాంటీడోస్ ఎందుకు ఇవ్వలేదనేదానిపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా లేకపోవడంపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.

News November 9, 2025

రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం

image

కొలిమిగుండ్ల(M) కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో డ్రైవర్ గురు ప్రసాద్ మృతి చెందినట్లు కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు వెల్లడించారు. సిమెంటు లోడు చేసుకొని పైకప్పు బిగిస్తుండగా ట్యాంకర్ నుంచి జారి కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతుడు ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సీఐ రమేష్ బాబు పేర్కొన్నారు.