News February 1, 2025
నెల్లూరులో వేడెక్కిన రాజకీయాలు
సింహపురిలో డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై సిగపట్లు మొదలయ్యాయి. దీంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికపై వైసీపీ, కూటమి నాయకులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. నువ్వా-నేనా అన్న విధంగా జిల్లాలో అధికార, ప్రతిపక్షం నాయకులు పోటీకి కాలు దువ్వుతున్నారు. బుచ్చి వైస్ ఛైర్మన్ పదవి విషయంలో మండల వైసీపీ నాయకులే టీడీపీలో చేరడం గమనార్హం.
Similar News
News February 1, 2025
బుచ్చిలో YCPకి గట్టి షాక్
బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ మాజీ వైస్ఛైర్మన్, 19వ డివిజన్ కౌన్సిలర్ కోటంరెడ్డి లలితమ్మ ఆమె భర్త శ్రీకాంత్ రెడ్డి వైసీపీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు వారు TDP తీర్థం పుచ్చుకున్నారు. మూడో తేదీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎంపిక జరగనున్న నేపథ్యంలో పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరటం చర్చనీయాంశమైంది. బుచ్చి వైసీపీ కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి కూడా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
News February 1, 2025
నెల్లూరు జిల్లాలో తాత్కాలికంగా ఆగిన పెన్షన్ పంపిణీ
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే పలు ప్రాంతాలలో సర్వర్ సమస్యల వల్ల పెన్షన్ల పంపిణీ ఆగినట్లు స్థానికుల తెలిపారు. అల్లూరు మండలంలోని పురిని, ఇందుపూరు తదితర ప్రాంతాల్లో సర్వర్ తాత్కాలికంగా ఆగిపోయింది. లబ్ధిదారులు పెన్షన్ నగదు కోసం ఎదురుచూస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా ఇలానే ఉందా.?
News February 1, 2025
నెల్లూరులో RTC బస్సు టైర్ కింద పడి విద్యార్థి మృతి
నెల్లూరులో BUS కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. కొడవలూరు(M) రేగడిచెలికు చెందిన మహేందర్ నెల్లూరులో ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ అనంతరం ఇంటికి వెళ్లేందుకు BUS ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లగానే ప్రయాణికుల కోసం BUS ఆపిన డ్రైవర్ అనంతరం BUSను కదిలించాడు. పుట్పాట్పై ఉన్న మహేందర్ పట్టు తప్పి BUS వెనుక టైర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.