News March 19, 2024
జనసేన జెండా ఎగరేసేందుకు కృషి చేయాలి: వర్మ

గొల్లప్రోలు మండలం చందుర్తిలో నిర్వహించిన బీసీ, ఎస్సీల అవగాహన సదస్సులో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి SVSN వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు పిఠాపురంలో జనసేన జెండా ఎగరేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ- జనసేన- బీజీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిఠాపురం నియోజవర్గ అభివృద్ధి విషయంలో సహకరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
Similar News
News September 7, 2025
వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి: ఎస్పీ

వినాయక చవితి వేడుకలు, మిలాద్ – ఉన్ – నబీ వేడుకలు జిల్లాలో శాంతియుతంగా జరిగాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ఈ పండుగలు మత సామరస్యాన్ని చాటి చెప్పాయన్నారు. విజయవంతంగా వేడుకలు నిర్వహించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. సహకరించిన కమిటీలు, రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.
News September 7, 2025
ధవలేశ్వరం: తగ్గుముఖం పట్టిన వరద

ధవలేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శనివారం రాత్రి 9 గంటలకు 7,38,035 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సాగునీటి అవసరాల కోసం 14,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
News September 7, 2025
రాజమండ్రి: కేసుల దర్యాప్తుకు కొత్త జాగిలాలు

కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపులో పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త జాగిలాలు వచ్చినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ తెలిపారు. ఈ నూతన జాగిలాల చేరికతో దర్యాప్తు మరింత శక్తివంతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ‘రాడో’ అనే జాగిలం శిక్షణ కాలంలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానం సాధించిందని ప్రశంసించారు. డాగ్ హ్యాండ్లర్ల కృషిని ఆయన అభినందించారు.