News February 1, 2025

జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

image

ధర్మపురి మైనారిటీ కాలేజీలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

Similar News

News February 1, 2025

రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లాకు సిల్వర్ మెడల్

image

కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా ఐటీ కోర్ టీం గంగేరి సంతోష్ కుమార్ త్వైకాండో సిల్వర్ మెడల్ సాధించారు. కరీంనగర్‌లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ వరకు  నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన సంతోష్‌ను అధికారులు ప్రశంసా పత్రం, సిల్వర్ మెడల్‌ అందజేసి అభినందించారు.

News February 1, 2025

రేపు పెద్దగట్టు ఆలయం వద్ద దిష్టి పూజ

image

పెద్దగట్టు జాతర వద్ద ఆదివారం దిష్టి పూజ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జాతరైన పెద్దగట్టు లింగమంతుల ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి దిష్టి పూజ నిర్వహిస్తారని పెద్దగట్టు ఛైర్మన్ నర్సయ్య యాదవ్ తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

News February 1, 2025

కేంద్ర బడ్జెట్‌‌లో ఏపీకి కేటాయింపులు ఇలా..

image

ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 DEC 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్‌లో పలు కేటాయింపులు చేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936cr
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157cr
* విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295cr
* విశాఖ పోర్టుకు రూ.730cr
* ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162cr
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు: రూ.186cr