News February 1, 2025
కాసేపట్లో మంత్రులతో CM అత్యవసర భేటీ

TG: సీఎం రేవంత్ కాసేపట్లో మంత్రులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరగనున్న ఈ భేటీలో ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలతో పాటు ప్రభుత్వ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధికారులెవరూ ఈ మీటింగ్కు రావొద్దని ఆదేశించినట్లు సమాచారం.
Similar News
News March 6, 2025
దేశంలో పెరుగుతున్న ‘స్లీప్ డివోర్స్’.. ఏంటిది?

నాణ్యమైన నిద్ర కోసం విడిగా పడుకునే జంటల సంఖ్య పెరుగుతోంది. భాగస్వాముల గురక, బెడ్ టైమ్స్ వేరుగా ఉండటమూ కారణాలుగా తెలుస్తోంది. దీన్నే ‘స్లీప్ డివోర్స్’ అంటున్నారు. గ్లోబల్ స్లీప్ సర్వే ప్రకారం ఈ జాబితాలో IND అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 78% జంటలు విడిగా పడుకుంటున్నాయి. ఆ తర్వాత చైనా(67%), సౌ.కొరియా(65%), US, UK(50%) ఉన్నాయి. కలిసి పడుకోవడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
News March 6, 2025
CM స్టాలిన్ టార్గెట్ ప్రకారం తమిళులు ఏడాదికి ఇద్దర్ని మించి కనాలి!

ప్రజలు తక్షణమే పిల్లల్ని కనాలన్న TN CM స్టాలిన్ టార్గెట్ ఈజీ కాదని డేటా చెబుతోంది. దేశ జనాభాలో TN వాటా 5.2%. నిజానికి అక్కడ 7.18%కు సమానమైన 39 LS సీట్లు ఉన్నాయి. ఒకవేళ 2026 జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేస్తే అదనంగా కోటిమంది కావాలి. ఇప్పుడున్న 1.52 TFR (ఫెర్టిలిటీ రేటు)తో 77లక్షల జననాలే సాధ్యం. మిగిలిన 23లక్షల మందిని కనాలంటే 3.23 TFR అవసరం. అంటే 15-45 ఏళ్ల గృహిణులు ఏడాదిలో ఇద్దర్ని మించి కనాలి.
News March 6, 2025
ఒకే వేదికపై దగ్గుబాటి, చంద్రబాబు

AP: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత తోడల్లుళ్లు ఒకే వేదికపై కనిపించారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దగ్గుబాటి సతీమణి, ఎంపీ పురందీశ్వరి తదితరులు పాల్గొన్నారు.