News February 1, 2025

యాదాద్రి జిల్లాలో నూతనంగా 2 పంచాయతీలు..!

image

యాదాద్రి జిల్లాలో నూతనంగా ఏడు పంచాయతీలను ఏర్పాటు చేస్తు గత ఆగస్టులో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పుడు గుర్జవానికుంట, ఇందిరానగర్‌ పెండింగ్‌లో ఉండగా.. నిన్న గ్రామపంచాయతీలకు అనుమతిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య 428కి చేరాయి.

Similar News

News December 31, 2025

ఈ ఏడాది క్రీడల్లో రాణించిన అమ్మాయిలు

image

ఈ ఏడాది అన్ని రంగాల్లో అతివలు రాణించారు. ముఖ్యంగా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్, అంధుల మహిళల టీమ్ టీ20 వరల్డ్ కప్, కబడ్డీ వరల్డ్ కప్, రోల్ బాల్ WC గెలిచారు. హాకీ ఆసియా కప్‌, అథ్లెటిక్స్, వరల్డ్ బాక్సింగ్ కప్‌లోనూ భారత నారీమణులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వీటితో పాటు షూటింగ్ నుంచి చెస్ వరకు, గోల్ఫ్ నుంచి బాక్సింగ్ వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలిచి స్ఫూర్తిని నింపారు.

News December 31, 2025

OpenAI ఉద్యోగుల సగటు వేతనం ₹13.4 కోట్లు!

image

టెక్ స్టార్టప్ చరిత్రలోనే OpenAI సరికొత్త రికార్డు సృష్టించింది. తన ఉద్యోగులకు ఒక్కొక్కరికీ సగటున ఏడాదికి $1.5 మిలియన్ల (సుమారు ₹13.48 కోట్లు) విలువైన స్టాక్ ఆధారిత జీతాలు ఇస్తోంది. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు IPOకి వెళ్లేముందు ఇచ్చిన దానికంటే ఇది 7 రెట్లు ఎక్కువ. AI రంగంలో టాలెంట్ కోసం పోటీ పెరగడంతో మెటా వంటి కంపెనీల నుంచి తమ వారిని కాపాడుకోవడానికి OpenAI ఈ భారీ ప్యాకేజీలు ఇస్తోంది.

News December 31, 2025

చీని, నిమ్మ తోటల్లో ఎగిరే పేను నియంత్రణ ఎలా?

image

చీని, నిమ్మ తోటల్లో ఎగిరే పేనును నియంత్రించేందుకు లీటరు నీటికి వేపనూనె 10,000 P.P.M 3ml కలిపి పిచికారీ చేయాలి. ఇది పిచికారీ చేసిన 7 రోజుల తర్వాత లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 S.L 0.6ml లేదా నోవల్యూరాన్ 10 E.C. 0.4 ml లేదా థయోమిథాక్సామ్ 25 W.G 0.3గ్రా కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పురుగు ఉద్ధృతిని బట్టి మందును మార్చి పిచికారీ చేయాలి. మొక్కలు పూతపై ఉంటే థయోమిథాక్సామ్ పిచికారీ చేయకూడదు.