News February 1, 2025
విశాఖ: తల్లిని చంపి రూమ్కి తాళం వేసిన కొడుకు
విశాఖలో కన్న కొడుకే తల్లిని <<15319558>>హత్య<<>>చేసిన విషయం తెలిసిందే. ఎవరూ లేని సమయంలో తల్లిపై కత్తితో దాడి చేయగా ఆమె చనిపోయింది. తల్లిని రూమ్లో పెట్టి తాళం వేశాడు. ఇంటికి వచ్చిన తమ్ముడు తల్లి గురించి అడగ్గా ఇంట్లో లేదని సమాధానం ఇచ్చాడు. చిన్నకొడుకు తండ్రికి ఫోన్ చేసి చెప్పగా కోస్ట్ గార్డులను ఇంటికి పంపించాడు. వారు వెతకగా అల్కాసింగ్ రక్తపు మడుగులో పడి ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News February 1, 2025
మద్దిలపాలెంలో వ్యభిచార గృహంపై దాడి
విశాఖలో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు MVP పోలీసులు తెలిపారు. మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో MVP పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైడ్లో వ్యభిచార గృహం నడిపిస్తున్న సంతోశ్ కుమార్, విటుడు పెందుర్తికి చెందిన కుమార్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
News February 1, 2025
విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు
వాల్తేర్ డివిజన్లో సాంకేతిక కారణాల వల్ల విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పలాస (67289/90)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 1, 2025
విజయనగరం వరకే విశాఖ-పార్వతీపురం ట్రైన్
వాల్తేర్ డివిజన్లో సాంకేతిక కారణాలతో పలు రైళ్ల గమ్యం కుదించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పార్వతీపురం(67287/88)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 విజయనగరం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పార్వతీపురానికి బదులుగా విజయనగరం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.