News February 1, 2025
BUDGET 2025-26: ముఖ్యాంశాలు
*గిగ్ వర్కర్లకు ఐడీ కార్డులు.. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు
*అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం
*MSMEలకు రూ.10వేల కోట్లతో ఫండ్
*నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది రూ.10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
*నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ బోర్డు
*సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
*ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు
Similar News
News February 1, 2025
AP పట్ల కేంద్రానికి ఇంతటి నిర్లక్ష్యమెందుకు?: జైరామ్ రమేశ్
కేంద్ర ప్రభుత్వం బిహార్కు బొనాంజా ప్రకటించి కూటమిలోనే భాగమైన ఆంధ్రప్రదేశ్ను మాత్రం అత్యంత క్రూరంగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ ట్విటర్లో విమర్శించారు. ‘త్వరలో ఎన్నికలున్నాయి కాబట్టి బిహార్కు కేంద్రం వరాలు కురిపించింది. అది సహజమే. కానీ ఎన్డీయేకు మూలస్తంభంలా ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఎందుకంత క్రూరంగా నిర్లక్ష్యం చేసింది?’ అని ప్రశ్నించారు.
News February 1, 2025
తర్వాతి మ్యాచ్లో షమీని ఆడిస్తాం: మోర్కెల్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో భాగంగా రేపు జరిగే ఆఖరి మ్యాచ్లో షమీని ఆడించనున్నట్లు భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపారు. ‘షమీ చాలా బాగా ఆడుతున్నారు. వార్మప్ గేమ్స్లో శరవేగంగా బౌలింగ్ చేస్తున్నారు. వచ్చే మ్యాచ్కి ఆయన్ను ఆడిస్తాం. ఆ అనుభవం యువ ఆటగాళ్లకు కీలకం’ అని పేర్కొన్నారు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ షమీకి భారత జట్టులో వరుస అవకాశాలివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
News February 1, 2025
ఎన్నికల దృష్ట్యా బడ్జెట్ రూపకల్పన?
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఢిల్లీ, బిహార్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో విద్యాధికులు, ఉద్యోగుల ప్రభావమే ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఆదాయ పన్ను భారీ మినహాయింపును ప్రకటించిందని అంటున్నారు. ఇక బిహార్ ఎన్నికల దృష్ట్యా ఇబ్బడి ముబ్బడిగా పలు మార్గాల్లో నిధుల్ని కేటాయించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీ అభిప్రాయం?