News February 1, 2025

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని ఈరోజు రాష్ట్ర డీజీపీ జితేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి, స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందర్, సీఐ నీలం రవి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Similar News

News March 14, 2025

సీతానగరం: ‘ఎలిఫెంట్ జోన్ మా కొద్దు’

image

నివాస ప్రాంతాల సమీపంలో ఎలిఫెంట్ జోన్ మా కొద్దని సీపీఎం నాయకులు కొల్లు గంగు నాయుడు డిమాండ్ చేశారు. సీతానగరం మండలంలో ఎలిఫెంట్ జోన్ పెట్టడం అంటే ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఎక్కడ నుంచి వచ్చిన ఏనుగులను అక్కడికి తరలించకుండా జనావాసాల మధ్య పెట్టడం సరైన విధానం కాదని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఎలిఫెంట్ జోన్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

News March 14, 2025

కాటారం: అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ

image

కాటారం శివారులో చింతకాని క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గతరాత్రి లారీ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది.  నిద్రమత్తులో లారీని డివైడర్ పైకి ఎక్కించినట్లు స్థానికులు తెలిపారు. ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసమైంది.

News March 14, 2025

IPL-2025లో కెప్టెన్లు

image

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్

error: Content is protected !!