News February 1, 2025

బడ్జెట్‌లో తెలంగాణ ప్రయోజనాలకు విలువ లేదా..?: హరీశ్ రావు

image

2025-26 బడ్జెట్‌ను కేంద్రం తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకున్నదే తప్ప దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదని హరీష్ రావు ‘X’లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పదేపదే వల్లే వేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా..? అని ప్రశ్నించారు. ఎన్నికలున్న రాష్ట్రాలకు వరాలు ప్రకటించి లేని రాష్ట్రాలకు వివక్ష చూపడం సరికాదన్నారు. బడ్జెట్లో తెలంగాణ ప్రయోజనాలకు విలువ లేదా..? అని నిలదీశారు.

Similar News

News February 1, 2025

బడ్జెట్లో ఖమ్మంకు తీవ్ర అన్యాయం: సీపీఎం

image

ఖమ్మం: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ, బిహార్ ఎన్నికల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని ఆరోపించారు. జిల్లాకు నిధుల కేటాయింపుపై అన్యాయం చేశారని, దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

News February 1, 2025

సంతనూతలపాడు: మహిళలకు ఉచిత కంప్యూటర్ కోర్స్ 

image

సంతనూతలపాడు మండలం ఏండ్లూర్ వద్ద మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ కోర్స్ శిక్షణ తరగతులు ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జే.రవితేజ యాదవ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 15 నుంచి 45 సంవత్సరాలు లోపు నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  

News February 1, 2025

డీజీపీని కలిసిన శ్రీకాకుళం ఎస్పీ

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన్ను మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని శాంతిభద్రతలకు తీసుకున్న చర్యలను ఎస్పీ డీజీపీకి తెలియజేశారు.