News February 1, 2025

కామారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు: ఎమ్మెల్యే

image

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Similar News

News January 12, 2026

PPP విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి: CBN

image

AP: నిధులు లేవని పనులు ఆపొద్దని, క్రియేటివ్‌గా ఆలోచించి ముందుకెళ్లాలని CBN సూచించారు. PPP పద్ధతిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులు, మంత్రులతో సమీక్షలో ఆదేశించారు. ‘కేంద్ర నిధులను కొన్ని శాఖలు ఖర్చు చేయడం లేదు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఎక్కువ నిధులు వచ్చే అవకాశమున్నా ఖర్చు చేయలేదు. నెలాఖరులోగా పూర్తి చేసి అదనపు నిధులు కోరాలి. కేంద్రం నుంచి అదనంగా నిధులు తెచ్చుకోవచ్చు’ అని CM పేర్కొన్నారు.

News January 12, 2026

తిరుపతి జిల్లాకు మరో రూ.200.82 కోట్ల పెట్టుబడి

image

జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీకి GOVT అనుమతిచ్చింది. రూ.200.82 కోట్లతో రానున్న ఈ ప్రాజెక్టుతో 245 మందికి జాబ్స్ రానున్నాయి. నాయుడుపేట MF-సెజ్‌లో 25.74 ఎకరాల్లో యూనిట్‌తో పాటు 9 బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. AP ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024–29 కింద రూ.56.72 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీని GOVT. మంజూరు చేసింది.

News January 12, 2026

టిమ్ కుక్ తర్వాత యాపిల్ బాస్ ఇతనేనా?

image

యాపిల్ CEOగా టిమ్ కుక్ తర్వాత జాన్ టెర్నస్ బాధ్యతలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. 50 ఏళ్ల ఈ హార్డ్‌వేర్ ఎక్స్‌పర్ట్ 2001 నుంచే కంపెనీలో ఉన్నారు. ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్ వంటి హిట్ ప్రొడక్ట్స్ వెనుక ఇతని హస్తం ఉంది. కాలేజీ రోజుల్లో వర్సిటీ స్విమ్మర్ అయిన టెర్నస్ ఇప్పుడు యాపిల్ పగ్గాల కోసం రేసులో ముందున్నారు. ఆయన డీటైలింగ్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ యాపిల్‌కు కొత్త వెలుగునిస్తాయని భావిస్తున్నారు.