News February 1, 2025

కామారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు: ఎమ్మెల్యే

image

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Similar News

News November 3, 2025

నరసాపురం: భారీ దొంగతనం కేసులో చేధించిన పోలీసులు

image

నరసాపురం(M) తూర్పుతాళ్లులో గతేడాది సెప్టెంబర్‌లో బంగారు షాపులో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. సోమవారం ఎస్పీ నయీమ్ అస్మి తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనానికి పాల్పడిన వారిలో నలుగురిని ఇవాళ అరెస్టు చేశారు. ఇదే కేసులో దొంగ బంగారం కొన్నట్లు తేలడంతో ముగ్గురు గోల్డ్ షాప్ యాజమానులపైనా కేసులు నమోదు చేశారు. మొత్తంగా 666గ్రా బంగారం, 2,638 గ్రాముల వెండి, నాలుగు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు.

News November 3, 2025

వనపర్తి: చేప పిల్లల పంపిణీ వేగవంతం చేయాలి: మంత్రి

image

చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వనపర్తి అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ పాల్గొన్నారు. చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, నవంబర్ 20లోపు అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

News November 3, 2025

VKB: తండ్రికి టాటా చెప్పి.. మృత్యువు ఒడికి

image

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు మండలంలోని ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురు ముస్కాన్ (21) హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సెలవులో ఇంటికి వచ్చిన ఆమె, సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరింది. బస్సు ఎక్కించే తండ్రికి “టాటా” చెప్పి వెళ్లిన ముస్కాన్ ప్రమాదంలో దుర్మరణం చెందింది.