News February 1, 2025

బెల్లంపల్లి: అడవి పందిని హతమార్చిన పెద్దపులి

image

2 రోజులుగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం బుగ్గ దేవాలయం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం మండల ప్రజలను హడలెత్తిస్తోంది. బుగ్గకు వెళ్లే రహదారి పక్కన తోకల మల్లేశ్‌కు చెందిన పత్తి చేనులో అడవి పందిపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పెద్దపులి దాడి విషయాన్ని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.

Similar News

News February 28, 2026

అన్నదాతకు రూ.25 వేల మద్దతు ధర వచ్చేనా.?

image

వరికి ఒక క్వింటా ₹2389 లెక్కన పుట్టి ధర ₹21330 వరకు A- గ్రేడ్ రకానికి ఇస్తుండగా సాధారణ రకానికి పుట్టి ధర ₹20,136 చొప్పున నిర్ణయించారు. అయితే కేంద్రాల్లో ధాన్యం విక్రాయించాలంటే తరుగులతో కొంత తీసేస్తుండగా గొనె సంచులు, రవాణా ఖర్చులు రైతులే భరించాల్సి ఉంది. దీంతో ఎకరాకు రూ.35-40 వేల వరకు ఖర్చు అవుతుండగా రైతుకు రూ.20 వేలు కూడా మిగలడం లేదు. ప్రభుత్వం పుట్టికి రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరారు.

News February 28, 2026

నెల్లూరు: 3.45 లక్షల ఎకరాల్లో వరిసాగు.!

image

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరలు దక్కడం లేదు. జిల్లాలో ఈ ఏడాది రబీలో 3.45 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి రానుంది. వచ్చే నెల నుంచి జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. 5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

News February 28, 2026

విజయ్‌కు దెబ్బ మీద దెబ్బ!

image

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి గడ్డుకాలం ఎదురవుతోంది. తొలుత కరూర్ తొక్కిసలాటలో 41 మంది చనిపోవడంతో ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దానిపై సీబీఐ ఎంక్వైరీ జరిగింది. తన చివరి చిత్రం ‘జననాయగన్’ సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా విడుదల కాలేదు. ఎప్పుడవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. తాజాగా విజయ్ భార్య విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.