News March 19, 2024

ఖమ్మం: మహిళా ఓటర్లే అధికం

image

ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో మహిళా ఓటర్లే అధికం. 2019లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. ఈసారి వీరి సంఖ్య 8,39,640కి పెరిగింది. పురుష ఓటర్లు 7,39,600 మంది నుంచి 7,84,043 మందికి చేరుకున్నారు. మహబూబాబాద్‌ స్థానంలో 2019లో 7,21,383 మంది మహిళా ఓటర్లు ఉండగా ఈసారి వీరి సంఖ్య 7,81,339కి పెరిగింది. పురుష ఓటర్లు 7,01,921 మంది నుంచి 7,45,564 మందికి చేరారు.

Similar News

News July 8, 2024

నేలపై కూర్చొని విద్యార్థులకు బోధించిన జిల్లా కలెక్టర్

image

ఏన్కూరు మండలం హిమంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేలపై కూర్చొని విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

News July 8, 2024

నీటి ప్రవాహానికి ఊపిరాడక వాహనదారుడు మృతి

image

మధిర శివాలయం వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. వైరా నదిలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రోడ్డుపై నుంచి మడుపల్లి గ్రామానికి ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా రోడ్డు కుంగి తూములో ఇరుక్కున్నాడు. దీంతో నీటి ప్రవాహానికి ఊపిరాడక అతడు మృతి చెందాడు. మృతుడు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన బోశెట్టి రమేష్‌‌గా పోలీసులు గుర్తించారు. 

News July 8, 2024

ఖమ్మం జిల్లాకు మూడు కార్పొరేషన్ పదవులు

image

తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు తదితర నేతలకు పదవులు దక్కాయి.