News February 1, 2025
జనగామ: విజయోస్తు స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్ ఆవిష్కరణ

జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులందరూ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలనే ఆశయంతో పదవ తరగతి గణితం విజయోస్తు స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్ను శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. ఈ స్టడీ మెటీరియల్ను ఉపయోగించుకొని గణితంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అలాగే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు.
Similar News
News September 18, 2025
SE, DEలతో NPDCL సీఎండీ వీడియో కాన్ఫరెన్స్

హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈలతో సమీక్షించి, ట్రాన్స్ఫార్మర్ల డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్లపై ఉన్న సర్వీసులను మ్యాపింగ్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సంస్థ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఈ చర్యలు తోడ్పడతాయని తెలిపారు.
News September 18, 2025
PDPL: ప్రీ- ప్రైమరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి జిల్లాలో కొత్తగా ప్రారంభించనున్న 12 ప్రీ- ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లుగా, ఆయాలుగా తాత్కాలిక పద్ధతిన పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి బుధవారం తెలిపారు. ఇందుకు సెప్టెంబర్ 21లోపు అవకాశం ఉందన్నారు. ఇంటర్, 7వ తరగతి విద్యార్హతలతో 18- 44ఏళ్ల మధ్య వయస్సున్నవారు సంబంధిత HMలకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఎంపికలో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
News September 18, 2025
మహబూబాబాద్: ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్లను తొలగించిన ప్రభుత్వం

మహబూబాబాద్ జిల్లాలో ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్లను ప్రభుత్వం తొలగించింది. తొర్రూరు, నెల్లికుదురు, బయ్యారం, కేసముద్రం, కురవి సొసైటీల ఛైర్మన్లను తొలగించి, వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. తొర్రూరుకు రమేశ్, బయ్యారానికి ఆదినారాయణ, నెల్లికుదురుకు మోహన్ రావు, కేసముద్రానికి ప్రవీణ్, కురవికి సుమలత ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరించారు.