News February 1, 2025

కథలాపూర్: తపాలా జీవిత పథకం ప్రవేశపెట్టి 141 ఏళ్లు

image

తపాలా శాఖ ఆధ్వర్యంలో తపాలా జీవిత బీమా పథకం ప్రవేశపెట్టి ఫిబ్రవరి 1 నాటికి 141 ఏళ్లు పూర్తయిందని తపాలా శాఖ ఉమ్మడి కరీంనగర్ పోస్టల్ సూపరింటెండెంట్ శివాజీ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని తపాలా శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. తపాలా బీమా పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఆయన వెంట సబ్ పోస్ట్ మాస్టర్ జయరాం ఉన్నారు.

Similar News

News February 2, 2025

MNCL: రోజూ 2.6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి: CMD

image

పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రతిరోజు 2.6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ CMD బలరాం ఆదేశించారు. శనివారం అన్ని ఏరియాల GMలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోజుకు 11రేకులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేయాలన్నారు. బొగ్గు ఉత్పత్తి సాధనలో నాణ్యతకు, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

News February 2, 2025

సంగారెడ్డి: ముగిసిన బడి బయట పిల్లల సర్వే

image

సంగారెడ్డి జిల్లాలో జనవరి 11 నుంచి సీఆర్పీలు, ఐఈఆర్పీలు నిర్వహించిన బడి బయట పిల్లల సర్వే శనివారంతో ముగిసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. బడి బయట పిల్లల సర్వేలో గుర్తించిన పిల్లల వివరాలను ప్రభంధ పోర్టల్ వెబ్సైట్‌లో నమోదు చేయాలని సీఆర్పీలకు, ఐఈఆర్పీలకు సూచించారు.

News February 2, 2025

జీవవైవిధ్య పరిరక్షణలో చిత్తడినేలల పాత్ర అద్వితీయం: మంత్రి సురేఖ

image

జీవ వైవిధ్య పరిరక్షణలో చిత్తడి నేలల పాత్ర అద్వితీయమైనదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఫిబ్రవరి 2న చిత్తడినేలల (వెట్ ల్యాండ్స్) పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి తన భావాలను పంచుకున్నారు. చిత్తడి నేలలు జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఉన్నాయన్నారు. కాలుష్య తీవ్రత కారణంగా పర్యావరణ అసమతుల్యతతో తలెత్తే దుష్ప్రభావాలను అరికట్టడంలో, నీటినాణ్యతను పెంచడంలో చిత్తడి నేలలు వడపోత వ్యవస్థగా పనిచేస్తాయన్నారు.