News February 2, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* రూ.50.65లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
* ఇది 140కోట్ల మంది ఆశల బడ్జెట్: PM మోదీ
* రూ.12 లక్షల వరకు నో IT
* బడ్జెట్‌ను స్వాగతించిన CBN, పవన్
* APలో మరో 7 ఎయిర్‌పోర్టులు: రామ్మోహన్
* AP పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ABV
* లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అందుకున్న సచిన్
* TGకు బడ్జెట్లో మొండిచెయ్యి: హరీశ్ రావు
* 5న TG క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Similar News

News February 2, 2025

NPS వాత్సల్య.. రూ.50వేలకు పన్ను మినహాయింపు

image

బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే <<14158275>>NPS వాత్సల్య పథకంపై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెక్షన్ 80CCD(1B) కింద ఈ స్కీమ్‌లో రూ.50,000 పెట్టుబడికి పన్ను మినహాయింపు కల్పించింది. గత ఏడాది ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 90వేల ఖాతాలు ప్రారంభమయ్యాయి. పన్ను ఊరటతో అకౌంట్ల సంఖ్య భారీగా పెరగనుంది.

News February 2, 2025

దేశ అప్పు రూ.181 లక్షల కోట్లు

image

దేశంపై అప్పుల భారం పదేళ్లలో ఏకంగా 192 శాతం పెరిగింది. 2015 మార్చి 31 నాటికి రూ.62 లక్షల కోట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రూ.181 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇందులో విదేశీ రుణం 6.18 లక్షల కోట్లు, అంతర్గత అప్పు రూ.175 లక్షల కోట్లని తెలిపింది. 2026 మార్చి 31కి మొత్తం అప్పు రూ.196 లక్షల కోట్లకు చేరొచ్చని పేర్కొంది.

News February 2, 2025

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేయాలి: సీఎం

image

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతుండటం, ప్యాకేజీ 3 పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించే 8kms ఓపెన్ కెనాల్ పనులు ఆగిపోయాయని, ఎస్టిమేట్స్ రివైజ్ చేయాలని కాంట్రాక్టర్ అడగడంతో సమస్య వచ్చినట్లు అధికారులు వివరించారు.