News February 2, 2025
ఇంటర్ ప్రాక్టికల్స్ను సజావుగా నిర్వహించాలి : డీఐఈవో

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించనున్న ప్రాక్టికల్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డీఐఈవో జితేందర్ రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. శనివారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 8, 2025
విశాఖపై దక్షిణాఫ్రికా క్రికెట్ కామెంటేటర్ భావోద్వేగ ట్వీట్

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత కాస్ నాయుడు (Kass Naidoo) విశాఖతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. #CWC25 సందర్భంగా విశాఖ వచ్చిన ఆమె భావోద్వేగంగా స్పందించారు. తన తాత అనకాపల్లిలో పుట్టారని.. 57 ఏళ్ల క్రితం తన అమ్మ కూడా విశాఖలోనే ఉండేవారని గుర్తు చేసుకున్నారు. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ను క్రీడా రంగంలోని ఉత్తములతో కలిసి వ్యాఖ్యానం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ ట్వీట్ చేశారు.
News November 8, 2025
దేశంలోనే మొదటి పురోహితురాలు

సాధారణంగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు వంటివన్నీ పురుషులే చేస్తుంటారు. కానీ కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ పదేళ్లుగా పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. నందిని రెండో కూతురి వివాహానికి పురోహితుడు ఎవరూ దొరక్కపోవడంతో ఆమే పురోహితురాలిగా మారారు. ఈ నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారంటున్నారు నందిని. ఎప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనేదే తన ఉద్దేశం అని చెబుతున్నారామె.
News November 8, 2025
వరంగల్: సెలవు పెడితే ప్రభుత్వానికి గండి

రిజిస్ట్రార్ సెలవు పెట్టిందే తడువు మూడు రోజుల్లో 21డాక్యుమెంట్లను ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్(జూనియర్ అసిస్టెంట్) రిజిస్టర్ చేసిన ఘటన HNK(D) భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగింది. నిబంధనలకు విరుద్దంగా ఉనికిచర్లలోని 2 సర్వే నంబర్లలో నాన్ లేఅవుట్ వెంచర్లలో 15 ప్లాట్లు, 6 ఇండ్లు సహా మొత్తం 21 రిజిస్ట్రేషన్లు చేశాడు. నిబంధనల ప్రకారం నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దు.


