News February 2, 2025
బోథ్: బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గోవర్ధన్

తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బోథ్కు చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు భారతాల గోవర్ధన్ నియమితులయ్యారు. గత రెండు రోజులుగా AITUC మహాసభలు జగిత్యాల జిల్లా కోరుట్లలో జరగగా ఆ మహాసభల్లో బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం గోవర్ధన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. బీడీ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని గోవర్ధన్ తెలిపారు.
Similar News
News March 8, 2025
ADB: LRS సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు

అనుమతి లేని లే అవుట్ క్రమబద్ధీకరణ (LRS) దరఖాస్తులను పరిష్కరించేందుకు జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు హెల్ప్ డెస్క్ను కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సందేహాలు ఉన్నవారు సెల్ ఫోన్ 8309959444 నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ నెల మార్చి 31 లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లించే వారికి 25శాతం రిబేట్ వర్తిస్తుందని పేర్కొన్నారు.
News March 8, 2025
ఆదిలాబాద్లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శనివారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం ధరల్లో మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News March 8, 2025
ADB: నేడు మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవు

జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించి ప్రత్యేక సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత తెలిపారు. కాగా జనవరి 31న నాగోబా జాతర సందర్భంగా పాఠశాలలకు లోకల్ హాలిడే ప్రకటించగా.. ఇవాళ రెండో శనివారం జిల్లాలోని పాఠశాలలకు పనిదినంగా ప్రకటించారు.