News February 2, 2025
నిర్మల్: ‘వివాహితతో రాసలీలలు.. సీసీ సస్పెండ్’

ఇటీవల నిర్మల్ పట్టణంలో కలెక్టర్ సీసీగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి రాకేష్ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విధుల నుంచి తొలగించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓ వివాహితతో రాసలీలలు నిర్వహిస్తుండగా పట్టుపడడంతో విచారణ చేపట్టామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.
Similar News
News September 18, 2025
వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్థిరంగా ఉంది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7440 ధర పలకగా.. ఈరోజు సైతం అదే ధర పలికింది. కాగా, సోమవారం రూ.7,400 ధర పలకగా.. మంగళవారం రూ.7,480 అయింది. మార్కెట్లో కొనుగోలు-అమ్మకాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
News September 18, 2025
సొంత నియోజకవర్గంలోనే పల్లాకు తలనొప్పి

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై TDP రాష్ట్ర అధ్యక్షుడు P.శ్రీనివాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధినేతగా రాష్ట్రవ్యాప్తంగా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నా.. సొంత నియోజకవర్గంలో మాత్రం ప్లాంట్ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు TDP కూడా కారణమని కార్మిక సంఘాల ఆరోపణలు, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏమైయ్యాయి? అని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తుండడంతో పల్లాకు మరింత ఇబ్బందిగా మారింది.
News September 18, 2025
నేనూ బాధితుడినే: MLA విష్ణుకుమార్ రాజు

AP టిడ్కో గృహాల సమస్యలపై విశాఖ MLA విష్ణుకుమార్ రాజు గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. బెనిఫిషరీస్ టిడ్కో ఇండ్లలో దిగి రెండేళ్లు అవుతున్నా.. కాంట్రాక్టర్లకు మాత్రం ఇంత వరకు బిల్లులు చెల్లించలేదన్నారు. తాను కూడా ఒక బాధితుడినే అన్నారు. తన కంపెనీకి రావాల్సిన రూ.123 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. జగన్ ప్యాలెస్ కట్టిన వారికి మాత్రం రూ.60 కోట్లను ఆర్ధిక శాఖ రిలీజ్ చేసిందన్నారు.