News March 19, 2024

హౌతీల దాడిలో సముద్రంలో మునిగిపోయిన నౌక

image

హౌతీల దాడిలో యూకేకు చెందిన రూబీమార్ అనే వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న 21,000 మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్ సముద్రం పాలయ్యాయి. దాదాపు 30 కి.మీ మేర సముద్రంపై చమురు తెట్టులా పేరుకుపోయింది. ఈ ఘటనతో అందులోని జీవరాశులకు ముప్పు ఏర్పడుతుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపలకు, పగడపు దిబ్బలకు పర్యావరణ నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు.

Similar News

News April 1, 2025

నొప్పి అంటే ఏంటో చూపిస్తా: హూతీలకు ట్రంప్ మాస్ వార్నింగ్

image

తమ దేశానికి చెందిన నౌకలపై దాడులు ఆపాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూతీలను హెచ్చరించారు. లేదంటే మీతోపాటు ఇరాన్‌కు కూడా నొప్పి అంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తమ నౌకలపై దాడులు ఆపేవరకూ హూతీలపై దాడులు ఆపమని స్పష్టం చేశారు. ఇరాన్ కూడా హూతీలకు తక్షణమే మద్దతు ఆపాలన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు 300 సార్లకుపైగా USకు చెందిన నౌకలపై దాడులు చేశారు

News April 1, 2025

IPL: నేడు లక్నోతో పంజాబ్ కింగ్స్‌ ఢీ

image

IPLలో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నోలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆడిన తొలి మ్యాచులోనే పంజాబ్ ఘన విజయం సాధించి జోరు మీద ఉంది. ఈ మ్యాచులో కూడా గెలిచి 2 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది. మరోవైపు లక్నో తొలి మ్యాచులో ఓటమిపాలైనా, రెండో మ్యాచులో SRHపై గెలిచింది. ఇదే జోరులో పంజాబ్‌ను ఓడించాలని యోచిస్తోంది.

News April 1, 2025

నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. బాపట్లలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

error: Content is protected !!