News February 2, 2025
కరీంనగర్ స్పోర్ట్స్ మీట్.. ఖోఖోలో సిరిసిల్ల థర్డ్ ప్రైజ్
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మూడో పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జోన్ ఖోఖో విభాగంలో మూడో బహుమతి గెలుచుకుంది. తృతీయ బహుమతి పొందిన టీం కెప్టెన్ అల్లం రమేష్(ట్రాఫిక్ ఎస్ఐ) టీం సభ్యులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది అభినందించారు.
Similar News
News February 2, 2025
కేంద్ర బడ్జెట్పై కరీంనగర్ MP ప్రశంసలు
కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.
News February 2, 2025
కేంద్ర బడ్జెట్పై కరీంనగర్ MP ప్రశంసలు
కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.
News February 2, 2025
డోర్నకల్: ముగ్గురు పిల్లలు, 12 పశువులపై దాడి
డోర్నకల్ మండలంలోని హూన్యతండా, లింబ్యతండాలో పిచ్చికుక్కలు ముగ్గురు పిల్లలపై దాడి చేశాయి. 12 పశువులపై దాడి చేసి గాయపరిచి బీభత్సం సృష్టించాయి. దీంతో రెండు గ్రామాల్లో ప్రజలు ఎటు వైపు నుంచి ఏ కుక్క వచ్చి కరుస్తుందేమోనని భయందోళనకు గురవుతున్నారు. పిల్లలు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు స్పందించి కుక్కలను అదుపు చేయాలన్నారు.