News February 2, 2025

మెదక్: BRS శ్రేణుల్లో పుల్ జోష్.. నింపిన KCR ప్రసంగం

image

జహీరాబాద్ నియోజక వర్గం నుంచి రైతులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాటలు కార్యకర్తలలో జోష్‌ను నింపాయి. కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయా ప్రాజెక్టులను మరుగున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అవసరమైతే ఉద్యమించి పోరాటం చేస్తానని తెలిపారు. ఉద్యమంలో తాను ముందుండి నడిపిస్తానన్నారు.

Similar News

News November 3, 2025

గద్వాల సబ్ డివిజన్ ఆఫీసులో వినియోగదారుల దినోత్సవం

image

గద్వాల విద్యుత్ సబ్ డివిజన్ ఆఫీసులో నేడు విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏడీఈ రమేష్ బాబు ఆదివారం రాత్రి ప్రకటనలో తెలిపారు. గద్వాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గద్వాల టౌన్, రూరల్, ధరూర్, కేటి దొడ్డి మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు పాల్గొనాలని కోరారు. ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవాలన్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందన్నారు.

News November 3, 2025

ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్

image

జనసమూహం ఉన్న చోట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పార్వతీపురం మన్యం కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి సూచించారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, ఫైర్ సర్వీసెస్, వైద్యారోగ్య శాఖ, నిర్వాహకులు నిరంతరం సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని సూచించారు. రద్దీని నివారించడానికి అవసరమైన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలన్నారు. అగ్నిమాపక, వైద్యసహాయ బృందాలు అందుబాటులో ఉండాలన్నారు.

News November 3, 2025

ఉమెన్స్ WC ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

image

టీమ్ ఇండియా ICC ఉమెన్స్ వన్డే <<18182320>>వరల్డ్ కప్<<>> విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో కప్పు కొట్టిన భారత్‌కు రూ.39.55 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. రన్నరప్ SA జట్టు రూ.19.77 కోట్లు అందుకుంటుంది. ఈ WCలో ప్రైజ్‌మనీ+బోనస్‌లు+పార్టిసిపేషన్ ఫీ+BCCI కార్యదర్సి దేవజిత్ సకారియా ప్రకటించిన రూ.51 కోట్లతో కలిపి మొత్తం భారత మహిళల జట్టుకు రూ.93.66 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంటుంది.