News February 2, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు 23 పోలింగ్ కేంద్రాలు: భద్రాద్రి అ.కలెక్టర్

image

WGL-KMM-NLG టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. శనివారం అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1949 మంది ఓటర్లకు 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో పురుషులు 1038, మహిళలు 911 మంది ఉన్నారన్నారు.

Similar News

News November 4, 2025

మందమర్రి: సింగరేణిలో కళాకారుల పాత్ర కీలకం

image

సింగరేణిలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమని మందమర్రి జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మందమర్రి పట్టణంలోని సీఈఆర్ క్లబ్బులో నిర్వహించిన కల్చరల్ మీట్ ప్రోగ్రాంని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి కళాకారులు పర్యావరణం, సేఫ్టీ వీక్ తదితర కార్యక్రమాల సందర్భంగా ప్రదర్శనలు ఇచ్చి కార్మికులకు అవగాహన కల్పించేలా కృషి చేస్తున్నారన్నారు.

News November 4, 2025

మంచిర్యాల: ‘వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి’

image

వరి ధాన్యం కొనుగోలు కొరకు జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 15 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో, 97 డీసీఎంఎస్ ఆధ్వర్యంలో, 63 మెప్మా ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రేడ్ ఏకు క్వింటాల్‌కు రూ.2,369, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు.

News November 4, 2025

కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అసంబద్ధం: YS జగన్

image

కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒక్క రోజులోనే సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. 31 తర్వాత దరఖాస్తుకు కూడా అవకాశం లేదు. ఒక్కరోజులో పంట పొలాల్లోకి వచ్చి ఎన్యూమరేషన్ చేయటం అసాధ్యం అని జగన్ విమర్శించారు. అసలు ఎన్యూమరేషన్ అంటే చంద్రబాబుకు తెలుసో లేదో తెలుసుకోవాలని ఆయన ప్రశ్నించారు.