News February 2, 2025

డోర్నకల్: వ్యక్తి ఆత్మహత్య.. ముగ్గురికి రిమాండ్

image

డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన పగడాల సతీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. చేతన చావుకి ముగ్గురు కారణమని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు డోర్నకల్ సీఐ రాజేశ్ తెలిపారు. నిందితులలో సుంకర వెంకన్న, అతని కుమారులు సుంకర పవన్, సుంకర చరణ్ వేధింపుల వల్లనే సతీశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. 

Similar News

News January 14, 2026

రూ.15,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీపై ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3,07,000కు చేరింది. బంగారం ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 ఎగబాకి రూ.1,43,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,000 పెరిగి రూ.1,31,650గా ఉంది. 3 రోజుల్లో కేజీ వెండి ధర రూ.32,000 పెరగడం గమనార్హం.

News January 14, 2026

దారుణం.. విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి

image

TG: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వీధికుక్కలపై విషప్రయోగం జరగడంతో దాదాపు 500-600 శునకాలు మృతిచెందాయి. మాచారెడ్డి(M) ఫరీద్‌పేట్, భవానీపేట, వాడి, పల్వంచలో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ‘గౌతమ్ స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్’ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

News January 14, 2026

నల్గొండ: 23, 24 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

image

జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు 20 తేదిలోగా నల్గొండ పౌర సంబంధాల అధికారిని సంప్రదించాలన్నారు.