News February 2, 2025

జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరం: MP

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి, జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరమని ఎంపీ రాఘురాం రెడ్డి అన్నారు. నిన్న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాలు కనిపించడంలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నేషనల్ హైవేలు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్‌‌పై ప్రస్తావించలేదన్నారు.

Similar News

News March 9, 2025

ఖమ్మం: విద్యార్థినికి మెసేజ్‌లు.. లెక్చరర్‌పై పోక్సో కేసు

image

ఖమ్మం గాంధీ చౌక్ వద్ద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది. ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినికి ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేస్తున్న లెక్చరర్ కె.హరిశంకర్‌పై ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు 3టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆయనను IEJD విధుల నుంచి తొలగించారు.

News March 9, 2025

ఎమ్మెల్సీ రేసులో విజయబాయి!

image

వైరాకి చెందిన కాంగ్రెస్ నాయకురాలు విజయబాయి MLC రేసులో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ఆశించగా రాందాస్ నాయక్‌కు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుండగా విజయబాయికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

News March 9, 2025

4 రోజుల్లో కూతురి వివాహం.. తండ్రి మృతి

image

నాలుగు రోజుల్లో కూతురు వివాహం ఉండగా తండ్రి మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో జరిగింది. మొండికుంటకు చెందిన రైతు చిన్న వెంకన్న గుండెపోటుతో మృతి చెందాడు. కాగా కూతురి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శుభలేఖలు పంచి ఇంటికి వచ్చిన ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగారు. కాగా ఈ నెల 12న జరగాల్సిన వివాహం వాయిదా పడింది.

error: Content is protected !!