News February 2, 2025

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తీవ్ర విషాదం

image

వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. కొండనాగులకు చెందిన జోగు మల్లయ్య(45), తిమ్మాజిపేట మండలం ఆవంచలో సత్తయ్య(42)లు ఇంట్లో చెప్పకుండా.. వారి వారి గ్రామ సమీపాల్లోని కుంటల్లో చేపలవేటకు వెళ్లారు. వారు ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. రెండురోజుల అనంతరం ఇద్దరూ ఆయా కుంటల్లో శవాలై ఆ ఊర్ల వారికి కనిపించారు. ఈ ఘటనలపై కేసునమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 31, 2025

MBNR: ఉద్యోగ నియామకాలు.. ప్రత్యేక సమావేశం

image

మహబూబ్‌నగర్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇవాళ జర్మనీ భాష, ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 22-38 సంవత్సరాలు ఉండాలని, BSc నర్సింగ్, GNM అర్హత కలిగిన వారు అర్హులని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 30, 2025

BIG BREAKING: మహబూబ్‌నగర్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

image

TGలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలైంది. భూత్పూర్, దేవరకద్ర, MBNR మున్సిపల్ కమిషనర్లతో EC గిరిధర్ సుందర్ బాబు VC నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు FEBలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.
SHARE IT

News December 30, 2025

మహబూబ్‌నగర్: ఆలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

image

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ప్రధాన ఆలయాల వద్ద ఎస్పీ డి.జానకి మంగళవారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు.