News February 2, 2025
HYD: నేడు కాంగ్రెస్ నిరసనలు

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Similar News
News November 11, 2025
ప్చ్.. దేశంలోనే జూబ్లీహిల్స్ లాస్ట్!

ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలింగ్ శాతంలో మన హైదరాబాద్ చివరి స్థానంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా 82.34 శాతంతో పోలింగ్లో నం.1 స్థానంలో నిలిచింది. మన జూబ్లీహిల్స్ మాత్రం 48.43% ఓటింగ్తో చివరి స్థానానికి పడిపోయింది. సెన్సిటివ్ ప్రాంతమైన జమ్మూకశ్మీర్లోని బడ్గాం నియోజకవర్గంలో మన కంటే 2% ఎక్కువే నమోదైంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏమో?
News November 11, 2025
జూబ్లీ పల్స్: ఎగ్జిట్ పోల్స్లో BJP డిపాజిట్ గల్లంతు!

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్లో మెజార్టీ సర్వేలు INC వైపు మొగ్గు చూపాయి. 2వ స్థానంలో BRS నిలుస్తుందని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసిన BJPకి కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నాయి. కీలకమైన సర్వేల్లోనూ కమలం కనీసం 10శాతం ఓటింగ్ రాబడుతుందని చెప్పలేకపోయాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ను SMలో పెడుతూ BJP కీలక నేతల మీద ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.
News November 11, 2025
FINAL UPDATE: జూబ్లీహిల్స్లో 48.43% పోలింగ్ నమోదు

నాయకులను ఎన్నుకోవడంలో హైదరాబాదీలు వెనకడుగు వేస్తున్నారని మరోసారి నిరూపించారు. సెలవు ఇచ్చి రండి బాబు ఓటింగ్కు అంటే జూబ్లీహిల్స్లో ఆమడ దూరం పోయారు. కొందరు ఉచిత ఆటోలు పెట్టారు. వాలంటీర్లు సేవ చేశారు. మొబైల్ భద్రపరిచేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. గంటసేపు ఓటింగ్ పెంచారు. అయినా సగానికి పైగా ఓటెయ్యలేదు. దేశంలో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా అత్యల్పంగా జూబ్లీలోనే ఓటింగ్ 48.43% నమోదు కావడం గమనార్హం.


