News March 19, 2024
కడప TDP ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి?

AP: వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి(కమలాపురం మాజీ ఎమ్మెల్యే)ని బరిలో నిలపాలని టీడీపీ యోచిస్తోంది. ఆయన పేరుతో కొన్ని రోజులుగా IVRS సర్వే చేస్తోంది. 2014లో పోటీ చేసిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఈసారి విముఖత చూపుతున్నట్లు సమాచారం. కాగా కడప ఎంపీ స్థానంలో టీడీపీ కేవలం ఒక్కసారే(1984లో నారాయణరెడ్డి) గెలిచింది. 1989 నుంచి వైఎస్ కుటుంబసభ్యులే విజయం సాధిస్తున్నారు.
Similar News
News August 27, 2025
KTRపై Dy.CM భట్టి విక్రమార్క ఫైర్

TG: వరద సహాయక చర్యలపై <<17533837>>KTR<<>> అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. వాళ్లలాగా ఇంట్లో కూర్చోలేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు CM ఆరా తీస్తున్నారు. నిన్న బిహార్ వెళ్లి సాయంత్రానికే తిరిగొచ్చారు’ అని తెలిపారు. వరదలు వస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని KTR విమర్శించిన సంగతి తెలిసిందే.
News August 27, 2025
US వస్తువులపై ఆధారపడటం తగ్గిద్దాం.. PMకి CTI లేఖ!

US 50% <<17529585>>టారిఫ్స్<<>>తో భారత్ ఎగుమతులపై ప్రభావంతో పాటు.. లక్షల ఉద్యోగాలు పోతాయని ‘ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ PM మోదీకి లేఖ రాసింది. లెదర్, టెక్స్టైల్స్, జ్యూవెలరీ, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ట్రంప్ ఒత్తిడికి తలగ్గొద్దని, అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలంది. UK, జర్మనీ, మలేషియా, సింగపూర్ వంటి దేశాల మార్కెట్లను ఎక్స్ప్లోర్ చేయాలని సూచించింది.
News August 27, 2025
GST రేట్స్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడా..!

GST శ్లాబులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని, US టారిఫ్స్ ప్రభావం పడకుండా ఎకానమీని స్థిర పరచాలని కేంద్రం భావిస్తోంది. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న పరిస్థితి తలెత్తొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్నులు తగ్గేంత మేర ఉత్పత్తుల ధరలు <<17529810>>పెంచాలని<<>> బీమా, సిమెంటు సహా కొన్ని కంపెనీలు భావిస్తున్నాయని వార్తలొస్తున్నాయి. వీటిపై కేంద్రం ముందే నిఘా పెట్టాలని నిపుణులు కోరుతున్నారు.