News February 2, 2025

పాడేరు ఘాట్‌లో ప్రమాదం.. ఒకరి మృతి

image

అల్లూరి జిల్లా  పాడేరు ఘాట్ రోడ్డు వంటల మామిడి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. 12వ మైలు, వంటల మామిడి మధ్య మలుపులో చోడవరం నుంచి వస్తున్న బైకును వ్యాను ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా.. మరొకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బైకు వెళ్తున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ.. ప్రమాద ధాటికి అది కూడా పగిలిపోయింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 31, 2025

నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్

image

నారాయణపేట జిల్లా నూతన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఉమాశంకర్ ప్రసాద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూరు అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను నారాయణపేటకు బదిలీ చేశారు. గతంలో ఇక్కడ నియమించిన నారాయణ్ అమిత్ మాలెంపాటి నియామకాన్ని రద్దు చేస్తూ, ఉమాశంకర్ ప్రసాద్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

News December 31, 2025

TTDకి కోటి రూపాయల విరాళం

image

TTD ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు విజ్ఞాన్స్ విద్యాసంస్థలు రూ.కోటి విరాళంగా ప్రకటించాయి.ఆ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలసి విరాళ డీడీని అందజేశారు. విద్యా రంగానికి విశేష సేవలందిస్తున్న విజ్ఞాన్స్ సంస్థల తరపున ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందజేయడం అభినందనీయమని ఛైర్మన్ పేర్కొన్నారు.

News December 31, 2025

నారాయణపేట ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకం

image

నారాయణపేట జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో శివకుమార్ రెడ్డి (సామాజిక సేవ), కృష్ణ కోర్వార్ (ఎన్జీఓ), పద్మ (మహిళా సంఘం) సభ్యులుగా నియమితులయ్యారు. వీరితో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సభ్యులుగా ఉంటారు.