News March 19, 2024
గుంటూరు: ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా రైతులకు విజ్ఞప్తి

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి సోమవారం ఒక ప్రకటన ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో ఆధారం లేకుండా అధిక మొత్తంలో నగదును తీసుకొని వెళ్లడం నేరం. మిర్చి యార్డులో మిర్చి అమ్ముకొని నగదు తీసుకొని వెళ్లేటప్పుడు రైతు సోదరులు నగదుకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకువెళ్లాలన్నారు. ఆ రసీదు మీకు ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News September 6, 2025
తురకపాలెం మరణాలపై కమిటీ ఏర్పాటు చేయాలి: షర్మిల

తురకపాలెం వరస మరణాలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. తురకపాలెం మరణాలపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు.
News September 6, 2025
అంబటి రాంబాబుపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశం

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏపీ సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో అంబటి రాంబాబు ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడ్డారని విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్కు ఫిర్యాదులు అందాయాని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటాలు, చెరువులు, కాలువల నుంచి మట్టి తీయాలంటే వాటాలు, జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో అక్రమాలు ఆధారంగా సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
News September 5, 2025
గుంటూరు జిల్లా ఉత్తమ HMగా విజయలక్ష్మీ

చేబ్రోలు మండల పరిధిలోని శేకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పి.విజయలక్ష్మీ గుంటూరు జిల్లా ఉత్తమ హెచ్ఎంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఎం విజయలక్ష్మీని మండల విద్యాశాఖ అధికారి రాయల సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పుర ప్రముఖులు అభినందించారు.