News February 2, 2025
జడ్చర్ల: ఆడుకుంటూ.. క్వారీ గుంతలో పడిపోయారు!

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ<<15332056>> రిజర్వాయర్లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 24, 2025
హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News December 24, 2025
అంతా తానై మనల్ని రక్షిస్తున్న ‘విష్ణుమూర్తి’

అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్న్యాయో నేతా సమీరణః|
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్సహస్రపాత్||
సృష్టిలో అందరికంటే ముందుండేవాడు, జీవులను సత్మార్గంలో నడిపించేవాడు, సమస్త ఐశ్వర్యాలకు అధిపతి ‘విష్ణుమూర్తి’. ఆయన నాయకుడే కాదు, న్యాయ స్వరూపుడై లోకాన్ని శాసిస్తాడు. విశ్వమంతా నిండిన ఆ ఆత్మ స్వరూపుడికి వేయి శిరస్సులు, వేయి కన్నులు, వేయి పాదములు ఉంటాయి. అంతటా తానై ఉండి మనల్ని రక్షిస్తుంటాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 24, 2025
ఏజెన్సీ ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు

AP: ఏజెన్సీలోని ఆసుపత్రులకు మందులు తదితరాలను ఇకనుంచి డ్రోన్ల ద్వారా అందించనున్నారు. ఈమేరకు ‘రెడ్ వింగ్’ అనే సంస్థతో వైద్యారోగ్యశాఖ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ సంస్థ అరుణాచల్ ప్రదేశ్లో ఇలాంటి సేవలు అందిస్తోంది. పాడేరు కేంద్రంగా 80 KM పరిధిలోని ఆసుపత్రులకు ఈ సంస్థ డ్రోన్లతో మందులు అందిస్తుంది. డ్రోన్లు తిరిగి వచ్చేటపుడు రోగుల రక్త, మల, మూత్ర నమూనాలను తీసుకువస్తాయని కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు.


