News February 2, 2025
కోటి మందే కానీ.. దేశ ఆదాయానికి వారే కీలకం
మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే (FY 2024-25). ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే. కోటి మందే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24 % వాటా వస్తే.. ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.
Similar News
News February 2, 2025
ప్రపంచ జనాభా.. బ్లడ్ గ్రూపుల వారీగా
O+: 42 శాతం
A+: 31 శాతం
B+: 15 శాతం
AB+: 5 శాతం
O-: 3 శాతం
A-: 2.5 శాతం
B-: 1 శాతం
AB-: 0.5 శాతం
**మరి మీది ఏ గ్రూప్..? కామెంట్ చేయండి.
News February 2, 2025
SO SAD.. దక్షిణాఫ్రికాకు మరోసారి హార్ట్ బ్రేక్
అంతర్జాతీయ టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికాకు అస్సలు కలిసి రావడం లేదు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్లో విజయం వారికి మరోసారి అందని ద్రాక్షగానే మిగిలింది. తాజాగా U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఆ జట్టు ప్లేయర్లు కన్నీరుపెట్టుకున్నారు. ఏడాది వ్యవధిలోనే సీనియర్స్ మహిళల, పురుషుల T20 WC ఫైనల్స్లోనూ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరి WTC ఫైనల్లోనైనా గెలుస్తుందేమో చూడాలి.
News February 2, 2025
ఆ హీరోను అన్నయ్య అని పిలుస్తా: కీర్తి సురేశ్
మలయాళ హీరో దిలీప్తో చిన్నతనంలో కూతురు పాత్రలో నటించినట్లు హీరోయిన్ కీర్తి సురేశ్ తెలిపారు. ఆ తర్వాత ఆయనను అంకుల్ అని పిలిచినట్లు చెప్పారు. కొన్నేళ్లకు ఆయనకు గర్ల్ ఫ్రెండ్ రోల్లో నటించగా ఆ సమయంలో అంకుల్ అని కాకుండా అన్నయ్య అని పిలవాలని దిలీప్ చెప్పినట్లు వెల్లడించారు. ఇక అప్పటినుంచి ఆయనను చేటా(అన్నయ్య) అని పిలుస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.