News February 2, 2025
బాత్రూమ్లో బిడ్డను కని చెత్తకుండీలో విసిరేసిన విద్యార్థిని
తమిళనాడులో అమానుష ఘటన జరిగింది. తంజావూర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీ బాత్రూమ్లో బిడ్డను ప్రసవించింది. యూట్యూబ్ సాయంతో బొడ్డు పేగు కోసి ఆ పసిప్రాణాన్ని చెత్తకుండీలో విసిరేసి క్లాస్ రూంకు తిరిగొచ్చింది. దుస్తులకు రక్తస్రావాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు లెక్చరర్లకు చెప్పడంతో వారు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బిడ్డను తీసుకొచ్చి బతికించారు.
Similar News
News February 2, 2025
ఈ నెల 4న కులగణనపై క్యాబినెట్ భేటీ
TG: రాష్ట్రంలో బీసీల సామాజిక న్యాయానికి అడుగుపడిందని క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో కులగణన సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. ఇలాంటి సర్వే దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. ఈ నెల 4న నివేదికపై క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామన్నారు. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలోనూ డిస్కస్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
News February 2, 2025
పాకిస్థాన్తో మ్యాచ్ అంత ప్రత్యేకమేమీ కాదు: గంభీర్
ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో పాక్తో తాము ఆడే మ్యాచ్ ప్రత్యేకమేమీ కాదని భారత కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. ‘23న పాక్తో మ్యాచ్ ఉంది అని పనిగట్టుకుని గుర్తుపెట్టుకుని టోర్నీలో అడుగుపెట్టం. లీగ్ దశలో 5 మ్యాచులున్నాయి. అన్నీ మాకు కీలకమే. పాక్తో మ్యాచ్ కూడా వాటిలాగే. దాని ప్రత్యేకతేమీ లేదు. ప్రేక్షకులకు భావోద్వేగాలుంటాయి’ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
News February 2, 2025
విలేకరిపై పూజా హెగ్డే ఆగ్రహం
‘దేవా’ మూవీ ప్రెస్మీట్లో ఓ విలేకరిపై నటి పూజా హెగ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సల్మాన్, హృతిక్, రణ్వీర్, షాహిద్ వంటివారి సరసన అవకాశాలు రావడం మీ లక్ అనుకుంటున్నారా? అందుకు మీకు అర్హత ఉందని భావిస్తున్నారా? పెద్ద హీరోల్ని చూసి సినిమాలు సెలక్ట్ చేసుకుంటారా?’ అంటూ విలేకరి అడిగిన ప్రశ్నల పట్ల ఆమె మండిపడ్డారు. నాతో మీ సమస్యేంటి అని ప్రశ్నించారు. వెంటనే హీరో షాహిద్ కలుగజేసుకుని ఆమెను శాంతింపజేశారు.