News February 2, 2025

ఇండియాకు WC అందించిన గొంగడి త్రిష

image

అండర్-19 ఉమెన్స్ WCలో 19 ఏళ్ల తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సంచలనం సృష్టించారు. 7 మ్యాచుల్లో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144గా ఉండటం విశేషం. ఈ WCలో అత్యధిక రన్స్ త్రిషవే. బౌలింగ్‌లోనూ సత్తా చాటి 7 వికెట్లు తీశారు. భద్రాచలంకు చెందిన త్రిష ఈ WCలో ఓపెనర్‌గా వచ్చి 4, 27, 49, 40, 110, 44 రన్స్ చేశారు.

Similar News

News February 2, 2025

BREAKING: చరిత్ర సృష్టించిన భారత్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ T20లో భారత్ చరిత్ర సృష్టించింది. T20Iలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసింది. అభిషేక్ శర్మ(94*), తిలక్ వర్మ(24) విధ్వంసంతో 6 ఓవర్లలో భారత్ 95/1 రన్స్ చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాట్లాండ్‌పై చేసిన 82/2 పవర్‌ప్లేలో భారత్‌కు అత్యధిక స్కోరు కాగా, ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. ప్రస్తుతం స్కోరు 9 ఓవర్లలో 136-2గా ఉంది.

News February 2, 2025

వాంఖడే స్టేడియంలో రిషి సునాక్

image

భారత్ పర్యటనలో ఉన్న బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ వాంఖడే స్టేడియంలో సందడి చేశారు. భారత్, ఇంగ్లండ్ జట్ల కెప్టెన్లు సూర్య, బట్లర్‌తో ఆయన సరదాగా సంభాషించారు. అంతకుముందు పార్సీ జింఖానా గ్రౌండ్‌లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా తన ముంబై పర్యటన ముగియదని Xలో రాసుకొచ్చారు.

News February 2, 2025

ఈ సారి CCL కప్పు గెలుస్తాం: అఖిల్

image

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఈ ఏడాది కప్పు గెలుస్తామంటూ హీరో అఖిల్ ధీమా వ్యక్తం చేశారు. 13 ఏళ్ల క్రితం విష్ణు ప్రారంభించిన CCL 11వ సీజన్ లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. జెర్సీ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నాలుగు సార్లు కప్పు గెలిచినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు CCL జరగనుంది. ఈ నెల 14, 15న తెలుగు వారియర్స్ మ్యాచ్ ఆడనుంది.