News February 2, 2025
కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణంపై దర్యాప్తు

గత నెల 29న మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30మంది మృతిచెందగా 60మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కుట్రకోణం దిశలో యూపీ సర్కారు దర్యాప్తు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 16వేలకు పైగా ఫోన్ నంబర్ల డేటాను అధికారులు విశ్లేషించారని, సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఘటనపై దర్యాప్తుకోసం సర్కారు ఇప్పటికే త్రిసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది.
Similar News
News March 11, 2025
భార్యాభర్తల ❤️ బాండింగ్ మరింత పెరగాలంటే..

ప్రేమ జంటలు, కొత్త దంపతులను చూస్తే ముచ్చటేస్తుంది. భాగస్వాముల పట్ల కేరింగ్, ఎమోషన్, ఇంటీమసీ బాగుంటుంది. సంసారంలో పడి, ఆఫీసులో బిజీ అయ్యాక లైఫ్ బోరింగ్, రొటీన్గా అనిపిస్తుంది. మళ్లీ హనీమూన్ తరహా శృంగారానుభూతులు పొందాలంటే 2:2:2 రూల్ పాటించాలని చెప్తున్నారు నిపుణులు. 2 వారాలకోసారి డేట్నైట్, 2 నెలలకోసారి వీకెండ్ గెట్అవే, 2 ఏళ్లకోసారి లాంగ్ వెకేషన్ ప్లాన్చేస్తే దాంపత్యం అత్యంత సుఖమయం అంటున్నారు.
News March 11, 2025
150 మంది సైనికుల ఊచకోత!

పాకిస్థాన్లో BLA (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) నరమేధం సృష్టించింది. తమ అధీనంలో ఉన్న 450 మందిలో 150 మంది సైనికులను ఊచకోత కోసినట్లు బీఎల్ఏ స్వయంగా ప్రకటించింది. తమపై సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా బలూచిస్థాన్ ప్రావిన్స్లో జాఫర్ ఎక్స్ప్రెస్ను బీఎల్ఏ హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ రైలులో ప్రయాణిస్తున్న వందలాదిమందిని బందీలుగా తీసుకున్నారు.
News March 11, 2025
KCRను కలిసిన దాసోజు శ్రవణ్

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. తనకు MLCగా అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు దాసోజుకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.