News March 19, 2024
ఆర్డర్ క్యాన్సిల్ చేసిన Flipkart.. రూ.10వేల జరిమానా!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710811682077-normal-WIFI.webp)
ఓ వ్యక్తి తాను ఎంతగానో ఇష్టపడిన ఐఫోన్ను కేవలం రూ.39 వేలకే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాడు. అయితే అదనపు లాభం కోసం ఉద్దేశపూర్వకంగా ఆ ఆర్డర్ను ఫ్లిప్కార్డ్ క్యాన్సిల్ చేసింది. తన డబ్బులు రీఫండ్ అయినప్పటికీ ఆర్డర్ను క్యాన్సిల్ చేసినందుకు వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. అతను అనుభవించిన మానసిక క్షోభకు రూ.10000 పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఫ్లిప్కార్ట్ను ఆదేశించింది.
Similar News
News July 8, 2024
ఆర్మీ వాహనంపై టెర్రరిస్టుల దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720436749069-normal-WIFI.webp)
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కథువాలో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. కొండ పైనుంచి వెహికల్పై కాల్పులు జరిపి, గ్రెనేడ్స్ వేయడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిన్న కుల్గాంలో సైన్యం, టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు ముష్కరులు చనిపోయారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
News July 8, 2024
మట్టి వినాయకులను పూజించండి: పవన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720358078093-normal-WIFI.webp)
AP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయకచవితికి మట్టి గణపతులనే పూజించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘మట్టి గణపతులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రయోగాత్మకంగా పిఠాపురంలో మట్టి వినాయకులను పూజించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్తో కాకుండా చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలి’ అని తనను కలిసిన పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్తో పవన్ వ్యాఖ్యానించారు.
News July 8, 2024
ఏపీ టెట్ షెడ్యూల్లో మార్పులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908557526-normal-WIFI.webp)
AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. జులై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్ను ఇవాళ రిలీజ్ చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.