News February 2, 2025

సారంగాపూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కంకట గ్రామానికి చెందిన బురారీ ముకేశ్ ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖ ట్రావెల్స్ బస్సులో హెల్పర్‌గా పనిచేస్తున్న ముఖేష్ తమిళనాడులోని తిరువన్నలై నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా లారీ ఢీకొని మృతిచెందాడని తెలిపారు.

Similar News

News September 19, 2025

పోలీస్ కస్టడీకి మిథున్ రెడ్డి.. విజయవాడకు తరలింపు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తరలించారు. ఆయన్ను 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అధికారులు ఇవాళ, రేపు విచారించనున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే.

News September 19, 2025

గజ్వేల్: కొమ్మ కొమ్మకో గూడు..

image

గజ్వేల్‌లో ఈత చెట్టు కొమ్మలకు ఉన్న గూళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పక్షులు అద్భుత నైపుణ్యంతో కట్టుకున్న ఈ గూళ్లు వద్ద సందడి చేస్తున్నాయి. ఈ దృశ్యం పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. గజ్వేల్ పట్టణం నుంచి సంగాపూర్ వెళ్లే దారిలో గజ్వేల్ బాలికల విద్యాసౌధం సమీపంలో ఈత చెట్టు కొమ్మలకు పక్షులు కట్టుకున్న గూళ్లు కనువిందు చేస్తున్నాయి.

News September 19, 2025

దర్శి: విద్యార్థి మృతి.. బస్సుల నిలిపివేత

image

దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న ముగ్గురిని ఓ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో చౌటపాలేనికి చెందిన ఇంటర్ విద్యార్థి యేసురాజు(17) మృతిచెందాడు. దీంతో ఇవాళ ఉదయం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బస్సులను గ్రామం నుంచి పంపించబోమన్నారు.