News February 2, 2025
హుజురాబాద్: చెరువు కుంటలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు స్నేహితులతో కలిసి చెరువు కుంటలో ఈతకు వెళ్లి వెంకట సాయి అనే 6వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. వెంకటసాయి మృతి చెందడంతో కందుగుల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 10, 2026
దిల్సుఖ్నగర్లో ‘నిరుద్యోగుల మిలియన్ మార్చ్’

తెలంగాణ ఉద్యమాలకు నిలయమైన ఈ నేలపై మరోసారి నిరుద్యోగుల ఆగ్రహం ఉప్పొంగుతోంది. ఏడాదిలోపే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుస్సా మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మిలియన్ మార్చ్కు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇవాళ ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’కు పిలుపునిచ్చారు. ఉ. 10 గంటలకు దిల్సుఖ్నగర్కు భారీగా తరలిరావాలన్నారు.
News March 10, 2026
మెగా కోడలికి ఆన్లైన్ వేధింపులు.. కేసు నమోదు

తనపై ఓ వ్యక్తి SMలో వేధింపులకు పాల్పడుతున్నాడంటూ నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నా వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీసేలా ‘Purple Crayon00’ ఇన్స్టా ఖాతా ద్వారా పోస్టులు, కామెంట్లు చేస్తున్నాడు. నా కుటుంబీకులనూ దూషిస్తూ అవమానిస్తున్నాడు. అతడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 10, 2026
‘సారా’.. మళ్లీ కావాలంటోన్న MLA సారు.. మీరేమంటారు?

ఉమ్మడి APలో సారా సామాజిక, ఆర్థిక, కుటుంబ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. దానికి వ్యతిరేకంగా దూబగుంట రోశమ్మ స్ఫూర్తితో ఎంతో మంది తిరుగుబాటు చేయడంతో సారా నిషేధం అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు TGలో సారా షాపులు ఓపెన్ చేయాలని MLA అనిరుధ్ డిమాండ్ చేయడం <<19339452>>చర్చనీయాంశమవుతోంది<<>>. గతంలో సారా తాగి 115 ఏళ్లు బతికారంటూ అన్సైంటిఫిక్ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు?


